తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతన్నల కోసం పదిహేడు వేల కోట్లకుపైగా రైతు రుణాలను మాఫీ చేశారు .
అంతే కాకుండా రైతన్నకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ,నాణ్యమైన విత్తనాలు ,ఉచిత ఎరువులతో పాటుగా లేటెస్ట్ గా ఎకరాకు పెట్టుబడి సాయం కింద ఎనిమిది వేల రూపాయలను ఆర్ధిక సాయంగా అందజేస్తున్న సంగతి తెల్సిందే.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఫిదా అయిన మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన మహారాష్ట్ర రైతన్నలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ తాలుకా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లేఖ రాశారు ..