తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు .
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కాంట్రాక్టర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దళిత కాంట్రాక్టర్లకు ఇరవై ఒక్కశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .దీంతో డిక్కీ ప్రతినిధులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు .
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.దళిత కాంట్రాక్టర్లకు ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిది హరీష్ రావు తెలిపారు ..