తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి .
అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావు ఈ ప్రమాద సంఘటన తెలుసుకొని హుటా హుటిన అన్ని పనులను మానుకొని అక్కడకి చేరుకున్నారు .అక్కడ చెల్లాచెదురుగా ఉన్న మృతుల బాడీలు ,మనుషులను చూసి మంత్రి హరీష్ రావు చలించిపోయారు .
స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పది నెలల పసిపాప శ్రీవల్లి ను చూసి కంటతడి పెట్టారు .ఆమె గురించి అడిగి తెలుసుకొని పాలు పట్టారా అని అడిగి మరి తెలుసుకున్నారు .అంతే కాకుండా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు మంత్రి.ప్రమాదంలో గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ,వైద్యులను ఆదేశించారు మంత్రి హరీష్ ..