ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షీతులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నాను .
ఆయన బాధపడి ఉంటె మన్నించమని ఆయన అన్నారు.ఇంకా మాట్లాడుతూ నేను వైసీపీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డిని అనాల్సిన మాటలను రమణ దీక్షీతులను అన్నాను అని ఆయన అన్నారు ..