Home / SLIDER / ‘రైతుబంధు’ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు..సీఎం కేసీఆర్

‘రైతుబంధు’ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు..సీఎం కేసీఆర్

‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కినట్లే ఉందని సీఎం విమర్శించారు. తాము చెప్పిన ప్రతీ పనీ చేశామని, రైతుల సంక్షేమం కోసం మానిఫెస్టోలో చెప్పని పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పంట పెట్టుబడి సాయం రెండో విడత సాయాన్ని నవంబర్ నెలలో అందచేస్తామని సీఎం ప్రకటించారు.

‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపిలు సంతోష్ కుమార్, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు కరెంటు బాధ పోయింది. నీళ్ల బాధ పోనుంది. పెట్టుబడి ఎట్ల అనే రంది లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది : సీఎం కేసీఆర్

‘‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే మంచిస్థితిలో ఉండేవారు. కానీ రాను రాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు అన్ని విధాలా నష్టపోయారు. తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నాం. అందుకే తెలంగాణ వచ్చినంక వ్యవసాయ రంగాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మొదట రైతులకు రుణమాఫీ చేసుకున్నం. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. 2019 జూన్ తర్వాత ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీరు వస్తుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చుకుంటున్నాం. ఇట్ల చాలా చేసుకుంటూ పోతున్నం. భూరికార్డుల ప్రక్షాళన చేసి, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. రైతులు పెట్టుబడి కోసం అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తున్నది. అందుకోసమే ఎకరానికి 8వేలు ఇస్తున్నాం. దీనితో పాటు రైతులకు జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

‘‘రైతులకు కరెంటు బాధ పోయింది. నీళ్ల బాధ పోతోంది. పెట్టుబడి ఎట్ల అనే రంది లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర నుంచి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయ పరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయిల్ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతున్నది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్దతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయ సమితుల జిల్లా కో ఆర్డినేటర్లు ఇజ్రాయిల్ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి, ఇజ్రాయిల్ పర్యటన ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat