Home / SLIDER / కాంగ్రెస్ వి ఆపద మొక్కులు..సీఎం కేసీఆర్

కాంగ్రెస్ వి ఆపద మొక్కులు..సీఎం కేసీఆర్

‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతినెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలు లాంటి తప్పక పెట్టాల్సిన ఖర్చులుంటాయి. ఇక మిగిలిన 2,500 కోట్లు మాత్రమే ప్రభుత్వం చేసే పనుల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించకుండా డబ్బులు జమ చేసినా 20 నెలల సమయం పడుతుంది. ఉద్యోగుల జీతాలు, అప్పు కిస్తీలు కూడా కట్టకుండా ఏ పనీ చేయకుండా 20 నెలలు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలిస్తున్నది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కిన మాదిరిగానే కాంగ్రెస్ రుణమాఫీ అంటున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

సమావేశంలో కో ఆర్డినేటర్లకు ముఖ్యమంత్రి చేసిన సూచనలు:
——————————————————————
• రైతులంతా ఒకే రకం వేసి నష్టపోకుండా డిమాండ్ కు తగినట్లు పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కలిగించాలి. నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్ ను బట్టి పంటలు పండించాలి. తెలంగాణలో పండించే ప్రతీ గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని రైతులకు విడమరిచి చెప్పాలి.

• తెలంగాణ ప్రజలకు ఏమి కావాలనే విషయాన్ని ముందుగా తెలుసుకుని, దాని ప్రకారం పంటలు పండించాలి

• నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలి. ఆయా నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మన రైతులు పండించిన కూరగాయలే తినాలి. అది అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరం

• రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది

• వాతావరణం, నేల స్వభావం, గాలివేగం, వర్షపాతం, ఉష్ణోగ్రతల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములను వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు క్రాప్ కాలనీలుగా విభజిస్తారు. ఆ విభజన ప్రకారం ఏ కాలనీలో ఏ పంట వేయాలనే విషయంలో సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా నిర్ణీత పంటలు వేసుకునే విధంగా రైతులకు చైతన్యం కలిగించాలి

• మార్కెట్ కు నియమిత పద్దతిలో పంటలు తేవాలి. అందరూ ఒకేసారి తమ ఉత్పత్తులు తేవొద్దు. ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్ కు సరుకులు తీసుకురావాలో ముందుగానే నిర్ణయించాలి

• ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలి. ఈ విషయంలో అవగాహన కలిగేందుకు జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇజ్రాయిల్ వెళ్లి వ్యవసాయ విధానాలు అధ్యయనం చేసి రావాలి. అక్కడ తెలుసుకున్న విషయాలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చెప్పాలి

• రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో తెలంగాణ రైతులు సంఘటిత శక్తిగా మారారు. రైతు సమన్వయ సమితులు ఎక్కువ పంట పండించే విధంగా, పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతు సమన్వయ సమితులు కృషి చేయాలి

• సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మూడేళ్లలో తెలంగాణలో మార్పు కనిపిస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది

• రైతులకు ఆధునిక సాగు పద్దతులను వివరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,500 రైతు వేదికలు నిర్మిస్తున్నాం. ఈ వేదికలను రైతులు ఉపయోగించుకునేలా చూడాలి

• తెలంగాణలో రైతులందరికీ 5 లక్షల జీవితబీమా చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రతీ రైతుకు 2,271 రూపాయల ప్రీమియం చెల్లిస్తుంది. సహజ, సాధారణ మరణమైనా సరే రైతుకు బీమా అందుతుంది. ఈ పథకం కోసం కొద్ది రోజుల్లోనే దరఖాస్తు ఫారాలు గ్రామాలకు అందుతాయి. రైతుల నుంచి నామిని ప్రతిపాదిత పత్రాలు సేకరించి, వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఎల్.ఐ.సి.కి అందించాలి. 15వ ఆగస్టు నుంచి ఎల్.ఐ.సి. బీమా సర్టిఫికెట్లను రైతులకు అందించాలి

• రైతు చనిపోయిన తర్వాత మరణ దృవీకరణ పత్రం సమర్పించిన 10 రోజుల్లోగా నామినీకి 5 లక్షలు అందుతాయి. మరణించిన రైతు పేరు మీద ఉన్నభూమి ఎవరి పేరు మీదికి బదిలీ అవుతుందో, బీమా పాలసీ కూడా ఆ రైతు పేరు మీద బదిలీ అవుతుంది. అలా బదిలీ చేసే బాధ్యతను రైతు సమన్వయ సమితులు స్వీకరించాలి

• రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, మార్పులు-చేర్పులను నమోదు చేసి జూన్ 20 లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వారి కుటుంబ సభ్యులకు అందించే విధానంలో త్వరలోనే ఒక విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటయిన క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలని సీఎం కోరారు. దాతలు విరాళలమిచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలని, మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో వేదికలు నిర్మించాలని చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఇచ్చిన చెక్కులను కొంతమంది రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారని, ఆ డబ్బులను రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేయాలని చెప్పారు. గ్రామాల్లో నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి, అలాంటి వారిని అధికారులకు పట్టివ్వాలని సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను కోరారు.

పోచారం లక్ష్మిపుత్రుడు: సీఎం కేసీఆర్

పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో వ్యవసాయానుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మిపుత్రుడని, అందుకే వ్యవసాయానికి అంతా మంచి జరుగుతున్నదని కేసీఆర్ అన్నారు. పోచారం నాయకత్వంలోనే తెలంగాణ రైతులు దేశంలోనే ధనిక రైతులుగా మారుతారని తనకు నమ్మకం ఉందని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat