బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .
ఈ ఇంటర్వ్యూ లో అమ్మడు మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన విలక్షణ నటులు రాజ్ కుమార్ రావ్ ,నవాజుద్దీన్ సిద్ధిఖీ లతో పాటుగా సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడు ధనుష్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పుకుంటూ వచ్చింది .మరి ముఖ్యనగ రాజ్ కుమార్ రావ్ పై అమ్మడు ప్రశంసల వర్షం కురిపించారు .
హీరో రాజ్ కుమార్ రావ్ అంటే ఎప్పటి నుండో అభిమానం ..అయితే పోయిన ఏడాది విడుదలైన బరేలీ కి బర్ఫీ మూవీ చూశాకా ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. అప్పటి నుండి ఆయన దృష్టిలో పడాలని ఆయన సోషల్ మీడియాలో పెట్టె ప్రతి ఫొటోకు కామెంట్ లైక్ చేసేదాన్ని .అయన అంటే అంత పిచ్చి ..అభిమానం ఆమె చెప్పుకొచ్చారు ..