తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు కార్యక్రమాలను జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెల్సిందే .
తాజాగా ఇటివల రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేలు ..రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలను రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో ఉన్న యాబై ఎనిమిది లక్షల మంది రైతన్నలకు ఆరు వేల కోట్ల రూపాయలను అందజేసిన సంగతి తెల్సిందే .
ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక అవార్డు రైతు బంధుకు స్కోచ్ అవార్డును వచ్చింది .కొలమానాలు ,ఓటింగ్ తో ఈ అవార్డును రైతు బంధుకు ప్రకటించారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఒక కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి పార్ధ సారథి అందుకోనున్నారు ..