Home / SLIDER / సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్

సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్

ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని బుదేరా లో 5.5 కోట్లతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ,భవనాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు.అనంతరం 85 లక్షల తో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గత పాలకులు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని చెప్పారు. ఎస్సీ బాలికల కోసం 30 మహిళా‌ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రారంభించారని చెప్పారు.

Image may contain: 8 people, people standing

బుదేరాలో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ కళాశాల భవనాన్ని మరో పది రోజుల్లో వినియోగం లోకి తెస్తామన్నారు. కంది నుంచి డిగ్రీ కళాశాలను ఇక్కడ కు మారుస్తామన్నారు. ఈ ఆవరణలో హరితహారం మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కళాశాలకు ఫర్నీచర్, బెడ్లు వెంటనే కొనుగోలు చేయలన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. హైదరాబాదు నుంచి జహీరాబాద్ వరకు ఒక్క గెస్ట్ హౌస్ లేదన్నారు.ఈ సమావేశం లో ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యే బాబు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 10 people, people standing

Image may contain: 5 people, people standing

see also:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat