ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు .
see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ప్రముఖ నటుడు,నిర్మాత ,దర్శకుడు,మాటల రచయిత అయిన పోసాని కృష్ణమురళిను రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు .
see this:వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు
అయితే గత కొంతకాలంగా పోసాని కృష్ణమురళి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ..బాబు పాలన వైపల్యంపై విరుచుకుపడుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఇటివల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో కలిశారు .