తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని అన్నారు..
see also:ప్రతిభావంతులకే ఉద్యోగులు..మంత్రి తుమ్మల
రైతుల యొక్క కష్టాలు ఇంకో రైతు మాత్రమే తెలుస్తుందని,అందుకే మన తెలంగాణ రైతుల కోసం మన రైతు ముఖ్యమంత్రి గారు రైతులకు పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తున్న ఘనత మన కేసీఆర్ గారిది అని అన్నారు..రైతు ఏదైనా అకాల మరణం చెందితే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వవానిది అని అన్నారు..తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు సీఎం కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు..
see also:నిరుద్యోగులకు టీ సర్కార్ గుడ్ న్యూస్
మహిళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి కోసం ప్రత్యేకంగా పథకాలు ఏర్పాటు చేసారని అని అన్నారు. అందులో భాగంగా పుట్టిన ఆడ బిడ్డకు కేసీఆర్ కిట్టు,చదువుకోవడానికి గురుకులాలు, పెళ్లి కి కల్యాణ లక్ష్మి పథకం, గర్భిణి స్త్రీ లకు వారి సంరక్షణ కోసం పథకాన్ని, ఒంటరిగా ఉన్న మహిళలకు పెన్స్షన్, ఉపాధి క్రింద ప్రతి మహిళలకు పెన్స్షన్, ఒక వేల అకాల కారణంగా భర్త చనిపోతే వారిని ఆదుకోవడానికి నెలకి 1000 పెన్స్షన్ ఇలా ప్రతి మహిళను తన సొంత తోబుట్టులాగా చూసుకుంటున్న ఘనత మన కేసీఆర్ గారిది అని అన్నారు..
see also:సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్