ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది.
తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఎదురైన పరిస్థితిని తలుచుకొని జగన్ కు పిరికితనం ,భయం మొదలైంది అని ఆయన అన్నారు.
అందుకే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్న కానీ బీజేపీ పార్టీని కానీ మోదీని కానీవిమర్శించలేకపోతున్నారు అని ఆయన అన్నారు .వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయం ,పిరికితనం ..మోదీ మాట ఎత్తితే ఎక్కడ జైలుకు పంపుతాడో మాట్లాడటం లేదని బాబు అన్నారు ..