ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు .బాబు పాలన దేశానికి ఆదర్శంగా నిలిచేలా కొనసాగింది .
అయితే ప్రస్తుత వాస్తవాలను గుర్తించలేక ..జరుగుతున్నా అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది.ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ ..గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేసి ఖర్చు చేస్తున్నాం అని ఆయన అన్నారు ..