ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది .
రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు .
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పరిపాలనను గాలికి వదిలేసింది. తమకు అనుకూలంగా ఉన్న అధికారులను అందలం ఎక్కిస్తూ వినని వార్ని సస్పెండ్ చేస్తూ వారిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు ..