సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తుంది..అదేమిటంటే..?ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్ను ఉచితంగా ఇస్తోందని..మరి ఈ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలిపేందుకే ఈ వార్త. అయితే ఈ మెసేజ్ రాగానే ఎంతో ఆశపడి నెటిజన్లు ఆ లింక్ ను ఓపెన్చేస్తున్నారు .అది ఓపెన్ చేయడంతోనే ఆ బంపర్ ఆఫర్ లింకును మరో 20 మందికి షేర్ చేయాలలి వారి మొబైల్ ఫోన్ కి మరొక మెసేజ్ వస్తుంది.
see also:మరోసారి భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు
దీంతో ఊరికే అంతేసి ఓచర్ ఫ్రీగా వస్తోందని 20 మందికి లింక్ను షేర్ చేస్తున్నారు.ఈ మెసేజ్ కాస్త వైరల్ కావడంతో డీ మార్ట్ స్పందించింది. ఈ విషయంపై డీమార్ట్ తన క్లారిటీ ఇచ్చింది. తాము ఇలా ఫ్రీగా ఎలాంటి గిఫ్ట్ ఓచర్లనూ అందించడం లేదని, ఇదంతా సైబర్ నేరగాళ్ల పనికావొచ్చని తెలిపింది . ఇలా వస్తున్న నకిలీ లింకులు డిలీట్ చేయాలని డీమర్ట్ కోరింది.అయితే ఇది వైరస్ లింకు అని, క్లిక్ చేస్తే ఫోన్లోని పాస్ వర్డులు, ఇతర వ్యక్తిగత సమాచారం హాకర్లకు వెళ్తుందని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.