రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. గురువారం జగిత్యాలలో జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రపథకాలకు 5 శాతం కూడా నిధులు రాలేదని ఎంపీ కవిత అన్నారు.
see also:ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం విషయంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ
కేంద్రం ఇస్తున్న నిధులు కింది స్థాయికి వెళ్ళడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఎంపీ కవిత స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టడం మాని..కేంద్రం నుంచి నిధులు వచ్చేలా బీజేపీ నేతలు దృష్టి పెట్టాలని కవిత కోరారు. కాగా, స్కూళ్ళు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు యూనిఫాంలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నారా..లేదా.. మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరుపై చర్చించినట్లు ఎంపీ కవిత చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని సమావేశం లో పాల్గొన్న సభ్యులు తెలిపారని ఎంపీ కవిత చెప్పారు. జగిత్యాల జిల్లా చాలా అంశాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని, ఇది జగిత్యాల జిల్లా ప్రజలకు గర్వకారణం అన్నారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో నెంబర్ స్థానం లో నిలవడం సంతోషకర విషయమన్నారు. కొత్త జిల్లా అయిన జగిత్యాల నాలుగు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అన్నారు.
Addressed District Infrastructure Scheme Advisory (DISHA) committee meeting in Jagtial. pic.twitter.com/4HUVQxMOf8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 14, 2018
see also;అభ్యర్థులకు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్పీఎస్సీ