వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాదయాత్రను తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్నారు. అయితే, జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ను కలిసిన ప్రతీ ఒక్కరు వారి వారి సమస్యలను జగన్కు చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు అర్హత ఉన్నా ఫించన్లు ఇవ్వడం లేదని వృద్ధులు, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చంద్రబాబు తమను మోసం చేశాడని నిరుద్యోగులు, తమకు ఇప్పటి వరకు రుణాలు మాఫీ కాలేదని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు జగన్కు చెబుతున్నారు. అయితే, జగన్ మాత్రం వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
see also:వైసీపీలోకి టాలీవుడ్ సీనియర్ నటి…శోభారాణి
ఇదిలా ఉండగా, 2014 సాధారణ ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతలను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఎమ్మెల్యే టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత ఇస్తా, మీకే టిక్కెట్ ఇస్తానంటూ చంద్రబాబు వారిని బుజ్జగించారు. చంద్రబాబు బుజ్జగింపులతో వారు శాంతించినా.. 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వారిలో మళ్లీ ఆందోళన నెలకొంది.
see also:వైఎస్ జగన్ 190వ రోజు పాదయాత్ర..!
ఈ నేపథ్యంలో టీడీపీని వీడేందుకు సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీని వీడనున్న నేతల్లో విశాఖ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కోన తాతారావు ప్రథమంగా వినిపిస్తోంది. ఏళ్లతరబడి పార్టీకి సేవ చేస్తున్నా.. చంద్రబాబు తనను గుర్తించకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కోన తాతారావు చర్చలు జరిపారని, త్వరలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు తాతారావు అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా కోన తాతారావు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు టీడీపీ నేతల్లో ఆందోళనను రేపుతున్నాయి.