తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ ప్రాజెక్టుల నీటితో సస్యశ్యామంలో చేయలని ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయ్యింది. శుక్రవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది .సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి.. పనులను వేగవంతం చేశారు.
see also:షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే
అందులో భాగంగానే మల్లన్న సాగర్ ను రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.మల్లన్న సాగర్ పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ స్వాగతించారు. ఆర్ అండ్ ఆర్ ముసుగులో ప్రాజెక్టులను అడ్డుకునే చర్యలపై హైకోర్ట్ సీరియస్ కావడం శుభపరిణామం అన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు ఈ తీర్పుచెంపపెట్టులాంటిదని తెలిపారు.