ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను గడగడలాడిస్తున్న సంఘటన చికాగో సెక్స్ రాకెట్ .అయితే ఈ రాకెట్ లో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఈ నేపథ్యంలో బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటడమే కాకుండా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోల ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి యువ హీరోల పక్కన నటిస్తున్న హాట్ యాంకర్ అనసూయను కూడా సంప్రదించారు.
see also:అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి
ఈ విషయం గురించి అనసూయ స్వయంగా ఒక ఆంగ్ల పత్రికకు చెప్పారు అని వార్తలు వస్తున్నాయి .సదరు పత్రికతో మాట్లాడుతూ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్ళలేదు .సరిగ్గా నాలుగు యేండ్ల కిందట ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కల్సి ఒక ఈవెంట్ కు హాజరయ్యాను .
see also:జలకాలాటలలో ఐస్క్రీమ్ పాప..!
ఈ క్రమంలో ఆ తర్వాత రెండు యేండ్ల తర్వాత అమెరికా నెంబర్ తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు .తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఒక కార్యక్రమంలో హాజరవ్వాలని ఆయన కోరాడు .అయితే శ్రీరాజ్ మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను.నేను హాజరుకాకపోయిన కానీ నా ఫోటోను పోస్టర్లో వేశారు అని ఆమె అన్నారు అని సదరు పత్రిక ఒక వార్తను ప్రచురించారు. ..