Home / Uncategorized / వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు

వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు

ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల నిర్వహణపై ఈ రోజు మంత్రి పద్మారావు గౌడ్ తో కలసి అయన సెక్రటేరియట్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష జరిపారు .

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..జులై 29న బోనాలు, 30వ తేదీన రంగం నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామన్నారు. ఈ బోనం తయారీకి కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రాముల బంగారం వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా బంగారు బోనం నమూనా ను మంత్రులు విడుదల చేశారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తునామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat