తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క కేఎల్ఆర్ ,బండ కార్తిక్ రెడ్డి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ను కలిశారు .
see also:సమన్వయంతో పనిచేద్దాం..!!
అయితే తెలంగాణ ప్రాంత నాయకులు తనపై పిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు అని నేను అనుకోవడంలేదు .వాళ్ళు రాహుల్ గాంధీ పుట్టిన రోజు కాబట్టి విషెస్ చెప్పడానికి వెళ్లారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు .అయితే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఏకంగా జాతీయ అధ్యక్షుడని కలవడం ..గ్రూపు ఫోటో దిగడం వెనక పెద్ద పెద్ద కారణాలే ఉన్నాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..
see also;పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలి..!!
ఈ నేపథ్యంలో గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఉంటె పార్టీలోని అభ్యర్థులకు సగమందికి డిపాజిట్లు రావు .అధికారం రాదు అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా వీళ్ళు కలవడం వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డికి పదవీ గండం తప్పదు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి .అయితే ఉత్తమ్ ను పీసీసీ పదవి నుండి తప్పించడానికి ఇలా వీళ్ళు కలిశారు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ..