తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ను కలిశారు.
see also:స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో విద్యాసంస్థల్లో హరితహారం
ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం మాజీ మంత్రి డీకే అరుణ,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ,కాంగ్రెస్లో ఇటీవలే చేరిన రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి శ్రీధర్ బాబు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు – ఇతర ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు నేతలు ఉత్తమ్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని విన్నవించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
see also:ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!
ముఖ్యంగా ఉత్తమ్ సీటుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి ఎసరు పెడుతునట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే వీరు రాహుల్ ను కలిశారని గుసగుసలు వినిపిస్తునాయి.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం 100 కోట్లు ఖర్చు పెడుతానని రాహుల్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.