2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి వైఎస్ జగన్ కి సపోర్ట్ చేస్తానని పవన్ చెప్పారని.. ఇది వాస్తవమని.. ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం వైసీపీ మాజీ ఎంపీ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అంతేకాదు చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకే కార్యక్రమంలో కలిశారు. నంబూరులో జరిగిన దశావతార వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు వచ్చారు. స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ పక్కనే చాలా సేపు కూర్చున్నప్పటికీ పలుకరించుకోక పోవడం విశేషం. ఎడమొహ పెడమొహంగా ఉన్నారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. తన పోరాట యాత్రలో టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా అనేక సభల్లో పవన్ పై సెటైర్లు విసిరారు. కాని స్వామి వారి విగ్రహ ప్రతిష్టలో ఇద్దరూ కలసి పలుకరించుకుంటారని అక్కడి ప్రజలు ఆసక్తిగా చూశారు. కాని వారి ఆశలు నెరవేరలేదు. ఇద్దరూ చాలాసేపు అక్కడే ఉన్నా కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోక పోవడం అక్కడి వారిని ఆశ్చర్యపర్చింది. దీంతో 2019 ఎన్నికల్లో జనసేనా ప్రధాన శత్రువు టీడీపీనే..అని స్ఫష్టంగా తెలుస్తుంది.