2015లో ధనుష్ హీరోగా రూపొందిన మారీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. సన్నివేశంలో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటుండగా ధనుష్కు తీవ్ర గాయాలయ్యాయని చిత్ర బృందం ప్రకటించింది. ధనుష్ కుడికాలు, ఎడమ చేతికి బలమైన గాయాలు అయినట్టు వారు తెలిపారు.
శరీరానికి తీవ్ర గాయాలైనప్పటికీ ధనుష్ వాటినేమీ లెక్క చేయక షూటింగ్ను పూర్తి చేసేందుకే మొగ్గు చూపాడట. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలతోపాటు ప్రేక్షకులు సైతం దైవాన్నిప్రార్ధిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
My beloved dear fans … It’s not a major injury and I’m well. Thank you so much for your concern prayers and love. Im forever grateful. Love you all. My pillars of strength.
— Dhanush (@dhanushkraja) June 23, 2018