తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత ఏక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.ఎవరైనా సహాయం అడిగితే వెంటనే వారికి తగిన సహాయం చేసి అండగా నిలబడుతారు.కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతోందని ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను అక్కడికక్కడే న్యాయం జరిగేలా చేస్తారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ప్రముఖ హీరోయిన్ అయితే ఈషా రెబ్బ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించాడు.
Which Indian states have banned plastic? As I see and follow our state is progressing in Many ways as no.1 but disappointment is we are no where in the list of banning Plastic. Please look into this for future of our people
@KTRTRS garu https://t.co/D8EqgpyazG— Eesha Rebba (@YoursEesha) June 23, 2018
“మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ను నిషేధించాయి.?. మన రాష్ట్రం చాలా విషయాల్లో నెం.1గా ఉంది. కానీ, మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఎందుకు మార్చడం లేదు. మీరు దీని గురించి ఆలోచించండి కేటీఆర్ గారు’ అంటూ ఆమె ట్వీట్ చేసింది .
Mere passage of a legislation to ban plastic won’t help. To enforce the legislation effectively, will need to do some serious spade work; sensitising officials, manufacturers and onboarding the entire civil society
We plan on working towards it methodically https://t.co/9WKkQjxCw2
— KTR (@KTRTRS) June 23, 2018
అయితే ఆమె చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించాడు.‘కేవలం చట్టాలు చేయడం వల్ల ప్లాస్టిక్ను నియంత్రించలేం. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు అధికారులు, తయారీదారులు, వినియోగదారులకు అర్థమైనప్పుడే నియంత్రించగలమని ప్రస్తుతం దీనిపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ’ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశాడు.
Thank U @KTRTRS garu for ur quick response. But I am not ready to accept this when young, efficient n effective leaders like U at our disposal. Please make our state No.1 once again in this matter. Make us proud to say we belong to Youngest state of India.Latest n updated version https://t.co/d5XhDtxHcR
— Eesha Rebba (@YoursEesha) June 23, 2018
ఈ సందర్భంగా ఆమె కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసి ‘ వెంటనే రిప్లై ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ . మీలాంటి సమర్థవంతుడైన యువ నాయకుడు మన రాష్ట్రంలో ఉంటే ఏదైనా సాధించగలం. మీరు తలుచుకుంటే మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రాల్లో నెం.1గా తీర్చిదిద్దగలరు ’ అంటూ ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.