తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ కు హరిత హారం .ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరా ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది .ఈ క్రమమలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తోప్రముఖ సినీనటి జీవిత భేటీ అయ్యారు.హరితహారంలో భాగస్వామ్యం విషయం పై ఆమె చర్చించారు.
see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!
సమావేశం ముగిసిన తరువాత జీవిత మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు. వచ్చే నెల 1న తమ కూతురు శివాని జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు.