నిత్యం ప్రజలతో మమేకం అయ్యే విషయంలో రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రత్యేకం . తాజాగా అదే విషయం మరోసారి స్పష్టం అయ్యింది.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21 న జిల్లా కలెక్టర్ గంభీర్రావు పేట మండలం లోని మల్లారెడ్డి పేట ఊర గుట్ట ను సందర్శించి హరితహరం క్రింద నాటిన మొక్కల సర్వైవల్ ను పరిశీలించారు .
see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
ఈ క్రమంలోనే అక్కడ నాటిన 4 వేల మొక్కలకు గానూ 4 వేల మొక్కలు బ్రతికి ఉండడం కలెక్టర్ కృష్ణ భాస్కర్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, నీటి ఎద్దడిని సైతం తట్టుకొని నూరు శాతం మొక్కలు బ్రతకడం, వాటి ఎదుగుదల ఆరోగ్యంగా ఉండడం గురించి జిల్లా గ్రామీణ అభివృద్ధిసంస్థ అధికారి బెజ్జారపు రవీందర్ ను అడిగి తెలుసుకున్నారు.ఉపాధిహామీ కూలీ ప్రత్యేక కృషి వల్లే ప్రతికూల వాతావరణం, పరిస్థితి లలోనూ వంద శాతం మొక్కలు బ్రతికి ఉన్నాయని గ్రామీణ అభివృద్ధిసంస్థ అధికారి జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ కు తెలిపారు.
see also:రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీ ప్రత్యేక కృషిని కృష్ణభాస్కర్ అభినందించారు.కలెక్టర్ హోదాను పక్కన పెట్టి…మొక్కలను తన స్వంత బిడ్డలుగా సాకుతున్న కూలీ చేతులను.. తన చేతుల్లోకి తీసుకుని నమస్కరించారు.మీ కృషి … మరెంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తుందని కృష్ణభాస్కర్అన్నారు.