‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని అంటున్నారు. అయితే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు జనం నుండి స్పందన కరువైంది. దీక్షకు టీడీపీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారు. ఇటు…. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చల్లబడిపోయారు. దీక్షలతో ఉక్కు ఫ్యాక్టరీ రాదని ఆయన తేల్చేశారు. జేసీ వ్యాఖ్యల్లో చాలా వరకు నిజముందని టీడీపీ నేతలే మాట్లాడుకోవడం కనిపించింది.
see also:మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ..!
మరోవైపు దీక్షా ప్రాంగణంలో స్టేజీ మీద లీడర్లే ఎక్కువగా ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మంది లీడర్లు వచ్చిపోతున్నారు. కానీ కింద మాత్రం జనం కనిపించడం లేదు. లైవ్లో జనాన్ని చూపించలేకపోతున్న టీడీపీ నేతలు కేవలం స్టేజీపై మాత్రం కెమెరా ఫోకస్ పెట్టి కవరేజీ చేసుకుంటున్నారు. దీక్షకు జనాన్ని ఎలా తీసుకురావాలో తెలియక టీడీపీ నేతలు కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క ఈ దీక్షలో బిర్యాని కూడ ఇస్తునట్లు సమచారం. అందుకే గత7 రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ 7 కిలోల బరువు పెరిగాడంటా….వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అంటున్నారంట డాక్టర్లు. నిజంగానే కడప ఉక్కు కోసం టీడీపీ చేపట్టిన దీక్ష పబ్లిసిటీ కోసమే అనే విధంగా తయారైంది.
see also:రేపు విజయవాడకు సీఎం కేసీఆర్