Home / SLIDER / ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!

ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు.

see also:ఘనంగా బోనాల పండుగ..!!

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స జరిగి మంత్రి పోచారం విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఫోన్ ద్వారా అధికారులకు సూచనలను, ఆదేశాలను అందించారు.

see also:ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..కేసీఆర్‌ను త్వ‌ర‌లో క‌లుస్తా

కొన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి రైతు బీమా వివరాల సేకరణ ఎంత శాతం పూర్తైందో తెలుసుకున్నారు. రైతుల నుండి రైతుబీమా వివరాల సేకరణ, నామిని వివరాలను త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఆయా జిల్లాల అధికారులు కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. వివరాల సేకరణ త్వరితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

see also:వ‌చ్చే మార్చి నాటికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

అదే విదంగా వర్షాలు కురిసి రైతులు జోరుగా విత్తనాలను సాగు చేస్తున్నందున, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడ కొరత లేకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

see also:రైతాంగానికి పెద్ద‌న్న‌గా సీఎం కేసీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat