Home / ANDHRAPRADESH / పవన్‌ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్‌ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్‌ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్‌ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన దిగ్గజ నటుడు స్వర్గీయ ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ కలయిక చర్చనీయాంశంగా మారింది.

see also:తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ అరాచకాన్ని బట్టబయలు చేసిన టీడీపీ నేతలు

ఎమ్మెల్యే బడేటి బుజ్జి(ఎస్వీఆర్‌కు బుజ్జి బంధువు) ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు శత జయంతి వేడుకలు జరగ్గా.. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ హాజయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణలో కామినేని పాల్గొన్నారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఎస్వీఆర్‌ కుమారుడు కామినేనికి క్లాస్‌మేట్‌ కావటం, పైగా తాను ప్రత్యేకంగా ఆహ్వానించటంతోనే ఈ కార్యక్రమానికి కామినేని హాజరైనట్లు ఎమ్మెల్యే బుజ్జి చెబుతున్నారు.

see also:జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat