గత కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తిరుమల పరిధిలోగల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ నేతలు రాళ్లు, చెప్పులతో చేసిన దాడిని మరువక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ సారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై టీడీపీ కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
see also:ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ కావలిలో జరిగిన బీజేపీ శ్రేణుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఉమా మహేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పులతో దాడి చేశాడు. దీంతో కన్నాకు స్వల్ప గాయాలయ్యాయి. చెప్పులను కన్నా లక్ష్మీ నారాయణపైకి విసిరాడు. కన్నా లక్ష్మీ నారాయణపై దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తగా గుర్తించిన బీజేపీ శ్రేణులు అతన్ని చితకబాదారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఉమా మహేశ్వరరావును అరెస్టు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు తమపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, టీడీపీ రౌడీయిజాన్ని కలిసికట్టుగా అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.