తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కాంగ్రెస్తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు.ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు దృష్టి కొంతకాలంగా కాంగ్రెస్పై పడింది.
ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో తెర వెనుక దౌత్యం నడుపుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేరుగానే ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పొత్తు కుదుర్చుకోవడానికి ముందే కాంగ్రెస్లో ఫలానా వారిని చేర్చడానికి వీలుగా ఓ జాబితాను రూపొందించుకున్నారు.దాన్ని అమలు చేసేందుకు రాహుల్ గాంధీతో తెరవెనుక చర్చలు జరిపారు.
ఆ చర్చల సారాంశం మేరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటీవల అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రెండ్రోజులపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెండుసార్లు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాహుల్గాంధీకి సలహాదారుగా ఉన్న ఓ మాజీ బ్యూరోక్రాట్కు ఈ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో చంద్రబాబు నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకుని వాటిని రాహుల్గాంధీకి అందజేయడమే ఈ సమావేశం ఉద్దేశమని వార్తలు వస్తున్నాయి .