అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన తెలంగాణ విద్యార్థి శరత్ పార్దీవదేహం రెండు రోజుల్లో హైదరాబాద్కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.అలాగే శరత్ మృతిపై దౌత్య సిబ్బందితో మాట్లాడామన్నారు. హత్యఘటనపై విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారని కేటీఆర్ తెలిపారు.శరత్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.శరత్ కుటుంబసభ్యులెవరైనా అమెరికా వెళితే వీసా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.