ఇంగ్లాండ్లో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇండియా ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉత్కంటభరితంగా జరిగిన మూడో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టీ20లోఇంగ్లాండ్ గెలవడంతో.. ఇంగ్లాండ్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 198 భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. భారత్ బ్యాట్స్మెన్స్ ఆ లక్ష్యాన్ని ఎంతో సునాయసంగా చేధించారు. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 100 పరుగులతో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బౌండరీలు బాదుతూ.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తానికి ఇంగ్లాండ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని చేధించి టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లో మూడో సెంచరీ, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా, టీ20 సిరీస్ భారత్ కైవసం అయిన నేపథ్యంలో జరిగిన సెలబ్రేషన్స్లో తాను కూడా అంటూ ధనాధన్ ధోని కుమార్తె జీవా జాయిన్ అయింది. అనుకున్నదే తడవుగా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చి కాసేపు డ్యాన్స్ చేసింది. ఆప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యాన్స్ చేసిన జీవా వీడియో మీ కోసం..!