Home / SLIDER / హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 తేదీల్లో గాంధీనగర్ వస్తారని శ్రీహరి వెల్లడించారు.సీఎం కేసీఆర్ భావితరాలను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని డిప్యూటీ సీఎం కడియం అన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగానే ప్రజలు హరిత హారంలో పాల్గొంటున్నారని తెలిపారు. భూపాలపల్లిలో 40 ఎకరాల్లో 30 వేల మొక్కలను నాటేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat