Home / ANDHRAPRADESH / రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి.

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, స‌మైక్యాంధ్ర పార్టీ నేత‌ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగిన‌ ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్‌
నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు.

2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఊమెన్‌ చాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించిన ఆయన గురువారం డీల్లీకి చేరుకొని పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. అయితే, కాంగ్రెస్ న‌ల్లారిని ఎందుకు చేర్చుకుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది. ఇపుడు నిలబడాలంటే… బలమైన నేతల వ్యక్తిగత పరపతిని ఆధారం చేసుకోవాలి. ఆ సెలెక్షన్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఆప్షన్ గా కనిపించారు వారికి. ఇక నల్లారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన నియోజకవర్గానికి విపరీతంగా ప్ర‌యోజ‌నాలు చేశారు. దీంతో ఆ లెక్క‌ల ఆధారంగా పార్టీలో చేర్చుకున్న‌ట్లు టాక్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat