Home / ANDHRAPRADESH / నాడు ఆరోగ్యసహాయ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్సార్..!

నాడు ఆరోగ్యసహాయ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్సార్..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తన వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో కడపజిల్లాలో జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో కొంత కాలం వైద్యునిగా సేవలు అందించారు .. ఆ తరువాత 1973 లొ తన సొంత గ్రామం అయిన పులివెందులలొ 70 పడకల ఆసుపత్రిని తన తండ్రి పేరుమీద నిర్మించి వచ్చినవారందరికి ఉచితంగా వైద్యం అందించారు.ఆ సమయంలో నామమాత్రం గా ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే వారు.

ఆ సమయంలో పులివెందుల చుట్టుపక్కల వై.యస్ రూపాయి డాక్టర్ గా పిలవబడ్డారు.దీని తరువాత 1978 లొ రాజకీయాలలోకి రావటం పులివెందుల నియొజకవర్గం నుండి ఎన్నికవడం జరిగాయి .1980లో మొదటిసారి అంజయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య సహాయ మంత్రి అయ్యారు. ఆరోజులలొ రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడిపొయింది. రాయలసీమ ప్రాంతం అయితే దుర్భిక్షంతో తాండవించింది. అప్పుడు వైయస్ రాయలసీమ కరువు ప్రాంతాలలో పర్యటించి వారి భాదలు చూసి చలించిపొయారు .

అప్పుడు వెంటనే రాష్ట్రానికి ప్రజా ప్రధినిదులుగా ఏదైనా చేయాలి అనే ఆలోచనతొ తాను ఒక నిర్ణయానికి వచ్చారు. అదే తాను మంత్రి హోదా లొ తీసుకునే వేతనం కరువు ప్రాంతాలకి ప్రభుత్వం ఇచ్చే సహాయక నిధులలొ కలిపి తాను మాత్రం మంత్రి హోదా లొ ఒక్క రూపాయి తీసుకొవటం. వెంటనే ఇక పై తనకి వచ్చే వేతనం ని కరువు సహాయకనిధికి వాడాలని తనకి మాత్రం ఒక్క రూపాయి చాలు అని. అలాగే మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా చెయాలి అని విజ్ఞప్తి చేస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యకు లేఖ రాసి అందరికి ఆదర్శం గా నిలిచారు వై.యస్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat