Home / ANDHRAPRADESH / దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది.

ఈ తరుణంలో వైఎస్సార్ గురించి మరో మూవీ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ మరణించిన హెలికాప్టర్ ప్రమాదం ఆధారంగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం.

కోలీవుడ్ హీరో కృష్ణ ,తెలుగు అమ్మాయి బింధుమాధవి జంటగా నటిస్తున్న కళుగు 2 లో వైఎస్సార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాద సంఘటనను తెరకెక్కించనున్నారు అని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.ఈ యంగ్ హీరో కెరీర్ లోనే మైలురాయిగా చెప్పుకునే ఘనవిజయం సాధించిన కళుగు మూవీకి సీక్వెల్ ఇది .సత్య శివ దర్శకుడు..యువన్ సంగీతం అందిస్తున్నాడు.అయితే దీని గురించి చిత్రం యూనిట్ అధికారకంగా ప్రకటించలేదు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat