Home / SLIDER / సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం..

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం..

సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో లాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రటకన విడుదల చేశారు. ఈ వర్షాకాల సీజన్లో ఎప్పటిలాగే వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు వైద్య మంత్రి. వర్షాకాల సీజనల్లో సాధారణంగా డెంగీ, స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఎపటైటీస్ (జాండీస్), విరేచనాలు, వాంతులు (గ్యాస్ట్రో ఎంట్రైటీస్) డిప్తీరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని చెప్పారు. ఇవన్నీ వైరల్ వ్యాధులు అయినందువల్ల ఒకరి నుంచి మరొకరికి సోకి, విస్తరించే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకని ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలని మంత్రి సూచించారు.

అందుబాటులో వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు

ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి, ప్రజలకు సరైన సత్వర వైద్యం అందడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులతో పాటు సిబ్బంది, డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ల్యాబ్ టెస్టులు చేయడానికి స్టాఫ్, కిట్లు, ఓపీలోనూ తగు సదుపాయాలు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తగినన్ని సిద్ధం చేశామన్నారు.

మిగతా శాఖలతో సమన్వయం

ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దోమలు పెరగకుండా, నీళ్ళు నిలువ ఉండకుండా, బురద, మురుగు నీరు లేకుండా, పారిశుద్ధ్యం సరిగా ఉండే విధంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసి వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆయా శాఖల సహకారంతో వైద్యశాఖ అధికారులు అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని మంత్రి సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి

ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. ఆయా జిల్లా కలెక్టర్లు, ఐటిడిఎ పిఓలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులందరితోనూ చర్చించామన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైనత్యం పెంచామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లోనూ సదుపాయాలు, మందులు, పరికరాలు పెంచామని, ఈ మధ్య అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లను కూడా నియమించామని, దీంతో ప్రజలకు మెరుగైన మంచి వైద్యం అందుతుందని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. ఇప్పుడిప్పుడే సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, వీటిని మొగ్గలోనే తుంచే విధంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రాథమిక దశలోనే వైద్యశాలలకు చేరితో ఎలాంటి ప్రమాదాలుండవని అన్నారు. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ డాక్టర్ రమేశ్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ డాక్టర్ శివ ప్రసాద్, ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ కంపా, ఏజెన్సీ ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఐటిడిఎ పీవోలు, డిఎం అండ్ హెచ్ ఓలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. సిఎం కెసిఆర్ సూచన ల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం అందుకుండా ఏ ఒక్కరూ ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ పని చేస్తున్నదని మంత్రి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat