తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు,రైతు భీమ ,కళ్యాణ లక్ష్మి ,విద్యార్ధులకు సన్నబియ్యం ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.అందులో భాగంగానే కేసీఆర్ కిట్ తరహాలో..గురుకుల విద్యార్థులకు కేసీఆర్ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ బ్యాగులు చూడటానికి అందంగా , ఆకర్షణీయంగా , మన్నికగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో అధికారులు ఈ బ్యాగులను పంపిణీ చేశారు. గులాబీ రంగు బ్యాగులపై సీఎం కేసీఆర్ చిరునవ్వుతో కూడిన ముఖచిత్రం అందరిని ఆకట్టుకుంటోంది.