Home / POLITICS / గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు

ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ ఇన్‌చార్జులు, గ్రామ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి విచక్షణాధికారాల ద్వారా వినియోగించడానికి జిల్లాకు రూ.కోటి చొప్పున 30 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పర్సన్ ఇన్‌చార్జులు, పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

‘‘కొత్తగా వచ్చే పర్సన్ ఇన్‌చార్జులు, గ్రామ కార్యదర్శులకు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత గ్రామం ఎలా ఉండాలి? మూడేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి? అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలి. వాటి అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు మూడేళ్లు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. వారికి ఏఏ పనులు చేయాలనే విషయంలో మార్గదర్శనం చేయాలి. తమకు అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలి. పని బాగా చేసిన వారిని రెగ్యులరైజ్ చేయాలి. పనితీరు బాగాలేని వారిని తొలగించాలి. గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక నిర్మించడం, డంప్ యార్డు ఏర్పటు చేయడం, పన్నులు వసూలు చేయడం తదితర పనులకు సంబంధించి చార్ట్ రూపొందించాలి. ఆయా విభాగాల్లో వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసుకున్నాము. చిన్న గ్రామ పంచాయితీల వల్ల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరింత తేలిక అవుతుంది. కోర్టు కేసుల నేపథ్యలో పంచాయితీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఉండేందుకు పర్సన్ ఇన్‌చార్జులను నియమిస్తున్నాం. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన సర్పంచులకు కూడా అసెంబ్లీలో చేసిన చట్టం ప్రకారం విధులు, బాధ్యతలు అప్పగించాలి. గ్రామాల అభివృద్దిలో గ్రామ పంచాయితీల పాత్రను క్రియాశీలం చేయాలి’’ అని సీఎం సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat