యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.దేశంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 92 వేల మంది రైతులకు రైతుబంధు చెక్కులు అందించామని, నిధులకు కొదువలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ నెల 15 నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తామని, అవసరమైన వారికి అద్దాలు ఇస్తామని, ఆపరేషన్లు చేస్తామని వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు జీవిత భీమా బాండ్లను రైతులకు అందజేసిన మంత్రి శ్రీ @KTRTRS#RythuBandhu pic.twitter.com/TfOEd398Ft
— TRS Party (@trspartyonline) August 8, 2018