ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన సందర్భంగా ఆ పార్టీలో కలకలం నెలకొంది. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు బట్టబయలు అయ్యాయి. నేడు, రేపు రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రాహుల్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో రాహుల్ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు.
అయితే, ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ స్వాగతం తెలిపిన సందర్భంగా అక్కడ కలకలం చోటుచేసుకుంది. పీసీసీ సెక్యురిటికి ఇచ్చిన లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిపై అగ్రహాం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ వ్యవహారశైలి సరిగా లేదుని జైపాల్ రెడ్డి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.