ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా క్లారిటీ ఇచ్చారు .
పర్యటనలో భాగంగా రెండో రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ భేటీ అయ్యారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీను ఓడించడమే ముఖ్య లక్ష్యం . అందుకు తమతో కల్సి వచ్చే ఏ పార్టీతో అయిన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని అయన చెప్పినట్లు సమాచారం . అంతే కాకుండా అవసరమైతే ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీతో పొత్తుకు రెడీ ఉండాలని నేతలకు రాహుల్ సూచించాడు అంట .ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఖాయం అనమాట ..