అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ సెలెక్ట్ చేసిన నలభై మంది నేతలకు మాత్రమే ఎంట్రీ ఉంది . సమావేశానికి వచ్చిన ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డికి పాస్ లేదని లోపలకి పోనివ్వలేదు దీంతో ఆయన ఏమి చేయాలో అర్ధం కాక వెనుతిరిగి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి ..