ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్లో అధికార లాంఛనాలతో వాజ్పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల పక్కన అమిత్ షా కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చోన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లు ఒక మాజీ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను కోట్లాదిమంది వీక్షిస్తున్నారన్న విషయాన్ని మరిచి ఇలా ఎలా ప్రవర్తిస్తారంటూ వారు నిలదీస్తున్నారు.