భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం రాష్ట్రంలోని మొత్తం నాలుగు ప్రాంతాల్లో స్మారక కేంద్రాలను నిర్మించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతే కాకుండా ఆగ్రాలోని ఆయన పూర్వీకుల గ్రామామైన బటేశ్వర్ తో పాటుగా వాజ్ పేయి తొలిసారిగా ఎంపీగా బరిలోకి దిగి గెలిచిన బలరామ్ పూర్ లో స్మారకాలను నిర్మంచనున్నది యూపీ సర్కారు..ఇవే కాకుండా రాజనీతి శాస్త్రంలో పీజీ చేసిన కాన్పూర్ ,రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఎంపీగా గెలుపొందిన లక్నో నగరాల్లో కూడా నిర్మించాలని సర్కారు ఆలోచిస్తుంది..