Home / SLIDER / టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!

కేరళ వరద బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వరద బాధితుల కోసం తక్షణ సాయం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాకుండా యాబై రెండున్నర లక్షల విలువ చేసే బాలామృతం,యాబై టన్నుల పాలపోడి,ఐదు వందల టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా త్రాగునీటిని శుద్ధి చేసే రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో మిషన్లను, వంద టన్నుల పశువుల దాణాను అందజేశారు.

అందుకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు,కార్యకర్తలు కేరలకు అండగా ఉండటానికి ముందుకోస్తున్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గాదరి కిశోర్ కుమార్ తన నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఎమ్మెల్యే చేసిన సాయానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. టీఆర్ఎస్వీ నాయకుడు గంట శంకర్ మాట్లాడుతూ నిత్యం నియోజక వర్గ ప్రజల గురించి ఆలోచిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అందరి మన్నలను పొందడమే కాకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.. తాజాగా కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని ఆయన అన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat