ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే.
అయితే ఇదే విషయం గురించి గతంలో కూడా పలుమార్లు ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు కూడా చెప్పింది. దరువు చెప్పిన పలు విషయాలు ఇప్పటికే వాస్తవరూపం కూడా దాల్చిన సంగతి కూడా మీకెరుకే. అయితే దరువు చెప్పిన విషయాన్ని నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే నెల సెప్టెంబర్ 2న వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తేల్చేసింది..
మాజీ మంత్రి ఆనం కు సంబంధించిన సన్నిహితులు,జిల్లా వైసీపీ నాయకుల సమాచారం మేరకు వచ్చే నెల రెండో తారిఖున అధికారకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. అయితే అదే రోజు దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వేల మంది అనుచరులతో ,వందలాది జిల్లాకు చెందిన నేతలతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరనున్నారు .