ప్రస్తుతం సోషల్ మీడియా,వాట్సప్ ,ట్విట్టర్ ఇలా పలు మాధ్యమాలల్లో ఈ ఫోటో వైరలవుతుంది. అంతే కాకుండా ఈఫోటోను చూసిన ,షేర్ చేస్తున్న.. చూస్తున్న ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు..ఊకోండి ఒక్క ఈ ఫోటో ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించడం ఏమిటి.. విడ్డూరం కాకపోతే.. అయిన ఈ ఫోటోలో అంతగా ఏముంది.. ఒక అవ్వ స్కూల్ కెళ్ళే పాప ఇద్దరు కల్సి ఏడుస్తున్నారు అని తేలిగ్గా తీసుకోకండి. ఈ ఒక్కఫోటోలోనే మ్యాటరంతా ఉంది. అసలు విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలోని ఒక స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థి విధ్యార్థినిలను ఒక అనాధశ్రమానికి తీసుకెళ్ళారు.. ఈ క్రమంలో ఒక పాపకు తమ బామ్మ తారసపడింది.
అంతే ఆ పాప తన బామ్మను చూడగానే కన్నీళ్ళు పెట్టుకోవడమే కాకుండా ఏకంగా ఆ బామ్మను గట్టిగా కౌగిలించుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో నివ్వెరపోయిన అక్కడ ఉన్నవారంతా ఏమి జరిగిందని వాకబ్ చేయగా సదరు బామ్మ ఆ పాపవాళ్ల తండ్రి తల్లి. ఆ పాప బామ్మ కన్పించడం లేదు .. ఎక్కడకెళ్ళిందని అడిగితే తల్లితండ్రులు బంధువుల ఇంటికెళ్ళిందని చెప్పారు అంట. తీరా ఆ బామ్మ ఇక్కడ ఉండటంతో పాప పట్టరాని దుఖః తో అలా చేసిందని తేలడంతో షాకవ్వడం వారి వంతైంది .
అయితే ఇది సరిగ్గా పదకొండేళ్ళ కింద జరగ్గా ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ ఫోటో.. ఈ ఆర్టికల్ చదివే వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. వయస్సు అయిపొయిందనో.. అసలు పని చేసుకోలేకపోతుందో అనో.. తమకు చిరాకు పెట్టిస్తూ కష్టపెడుతుందని తల్లితండ్రులను ఇలా అనాధశ్రమాలకు పంపకండి.. ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు కూడా మీ పిల్లలకు ఇలాగే అనిపిస్తారు. అప్పుడు మీరు మీ తల్లి తండ్రులను ఎలా ట్రీట్ చేశారో మిమ్మలని చూస్తు పెరిగిన మీ పిల్లలు కూడా ఇలానే మిమ్మలని అనాధశ్రమాలకు పంపుతారు జాగ్రత్త..పిల్లలకు ఆస్తులు ఇవ్వకపొయిన పర్వాలే విలువలతో కూడిన ప్రేమానురాగాలను అందించండి.